'వందేమాతరం'పై భగ్గుమన్న ఓవైసీ.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ
- ‘వందేమాతరం’కు జాతీయ గీతంతో సమాన హోదా
- కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం
- అది ఒక దేవతను కీర్తించే పాట అని వ్యాఖ్య
- ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ
- మతపరమైన రాజకీయాల కోసమే వ్యతిరేకత అని విమర్శ
'వందేమాతరం'కు జాతీయ గీతం 'జన గణ మన'తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక దేవతను కీర్తించే గీతమని, దానిని జాతీయ గీతంతో సమానంగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఓవైసీ.. దేశం ఏ దేవుడు లేదా దేవత పేరు మీద నడవదని అన్నారు. "జన గణ మన భారతదేశాన్ని, దాని ప్రజలను కీర్తిస్తుంది, ఒక నిర్దిష్ట మతాన్ని కాదు. రాజ్యాంగ ప్రవేశిక 'ప్రజలమైన మేము' అని మొదలవుతుంది కానీ 'భారత మాత' అని కాదు. దేశమంటే దేవత కాదు, అది ప్రజల సమూహం" అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్లోనే వందేమాతరంపై చర్చ జరిగిందని, దాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు.
ఓవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం నాయకత్వం సాంస్కృతిక ఏకీకరణను తమ మతపరమైన ప్రత్యేకవాదానికి ముప్పుగా భావిస్తుందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందేమాతరంను వ్యతిరేకించని జిన్నా, పార్టీని వీడాకే వ్యతిరేకించడం మొదలుపెట్టారని, ఓవైసీ కూడా అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి ప్రతి అంశాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోందని, మతపరమైన ప్రత్యేకవాదంతో తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవడానికే ఇలాంటి వ్యతిరేకత చూపుతున్నారని రావు ఆరోపించారు.
1971 నాటి జాతీయ గౌరవ చిహ్నాల అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఇకపై వందేమాతరం గానానికి ఆటంకం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. తద్వారా జన గణ మనతో సమానమైన చట్టబద్ధమైన రక్షణ వందేమాతరానికి లభించనుంది.
ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఓవైసీ.. దేశం ఏ దేవుడు లేదా దేవత పేరు మీద నడవదని అన్నారు. "జన గణ మన భారతదేశాన్ని, దాని ప్రజలను కీర్తిస్తుంది, ఒక నిర్దిష్ట మతాన్ని కాదు. రాజ్యాంగ ప్రవేశిక 'ప్రజలమైన మేము' అని మొదలవుతుంది కానీ 'భారత మాత' అని కాదు. దేశమంటే దేవత కాదు, అది ప్రజల సమూహం" అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్లోనే వందేమాతరంపై చర్చ జరిగిందని, దాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు.
ఓవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం నాయకత్వం సాంస్కృతిక ఏకీకరణను తమ మతపరమైన ప్రత్యేకవాదానికి ముప్పుగా భావిస్తుందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందేమాతరంను వ్యతిరేకించని జిన్నా, పార్టీని వీడాకే వ్యతిరేకించడం మొదలుపెట్టారని, ఓవైసీ కూడా అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి ప్రతి అంశాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోందని, మతపరమైన ప్రత్యేకవాదంతో తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవడానికే ఇలాంటి వ్యతిరేకత చూపుతున్నారని రావు ఆరోపించారు.
1971 నాటి జాతీయ గౌరవ చిహ్నాల అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఇకపై వందేమాతరం గానానికి ఆటంకం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. తద్వారా జన గణ మనతో సమానమైన చట్టబద్ధమైన రక్షణ వందేమాతరానికి లభించనుంది.